Product details
డాక్టరు దంపతులు విభిన్న వ్యక్తిత్వాలు కలవారని ప్రతీతి. వటవృక్షము వంటి వారు సదాశివరావుగారు, ఆ చెట్టు నీడనే వుంటూ తనదైన ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సంతరించు కొన్న ప్రజ్ఞాశాలిని శ్రీమతి జయప్రదాంబ. సదాశివరావుగారు వేగంగా ప్రవహించే జీవనది. అమ్మ జయప్రద కరుణా కమలాలు వికసించిన మంచినీటి కొలను. ఈ భిన్నత్వములోని ఏకత్వానికి చిహ్నం "ప్రజావైద్యశాల." వీరిరువురూ బాధానివారణకు చేసిన సేవలు అపూర్వం. అదే ఒక క్రొత్త బాట. తెలుగునాట పండిత పామర జనరంజకంగా పద్యాన్ని ఏ విధంగా తిరుపతి వెంకటకవులు ప్రచారంచేసి సాఫల్యము గాంచారో అలా భయపూరితులూ, సందేహగ్రస్తులూ అయిన రోగులకు శస్త్రవైద్యాన్ని సులభ సాధ్యం చేసి ఘనతవహించారీ దంపతులు.
Similar products